మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమారుడు, మాజీ మంత్రి పీవీ రంగారావు మృతించెందారు. ఆగస్టు 1 తెల్లవారు జామున హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తన నివాసంలో రంగారావు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
కొన్ని రోజులుగా ఆయన గుండెపోటుతో బాధపడుతున్నారు. కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. వరంగల్ జిల్లా హన్మకొండ నుంచి రెండు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు.
బ్రహ్మచారి అయిన పీవీ రంగారావుకు ఇద్దరు సోదరులు, ఐదుగురు సోదరీమణులున్నారు. రంగారావు మృతితో ఆయన బంధుమిత్రులు, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
No comments:
Post a Comment