Tuesday 6 August 2013

తెలంగాణపై సోనియా ఏమన్నారంటే....

   

 









 

తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని ఏఐసిసి అధ్యక్షురాలు, యూపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ మరోసారి తేల్చి చెప్పారు. కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నేతృత్వంలో కర్నూలు నేతలు సోనియాను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. అందుకు ఆమె స్పందిస్తూ... ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. మీ ప్రాంత సమస్యలు వినేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సీమాంధ్రకు వచ్చే ప్రతి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుందామని ఆమె సూచించారు. సమస్యలను వినేందుకే తాము ఆంటోని కమిటీని వేసినట్లు చెప్పారు. ఆంటోనీ కమిటీ ముందు మీ సమస్యలు, అభిప్రాయాలు అన్ని చెప్పాలని ఆమె చెప్పారు. కాగా ఈ సమయంలో కోట్ల విభజన ద్వారా వచ్చే సమస్యలను సోనియా ముందు పెట్టారు.

No comments:

Post a Comment