Friday 7 June 2013

విజయమ్మను ఓదార్చిన సబితా..

విజయమ్మను ఓదార్చిన సబితా..
అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి
శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.. కోర్టులో ఇద్దరూ పక్కపక్కనే
కూర్చున్నారు.. మరో వైపు జగన్ తల్లి విజయమ్మ కంటనీరు పెట్టుకున్న సందర్భంలో
సబితా ఆమెను ఓదార్చడం జరిగింది.. కేసు విచారణ జరుగుతున్న సమయంలో
జగన్, సబిత అనుచరులు కోర్టులోకి వచ్చి నినాదాలు చేయడంతో కొంత అలజడి
చెలరేగింది. విచారణ 10 నిమిషాలు వాయిదా పడింది. ఇక జగన్ రిమాండ్‌ను నాంపల్లి
సీబీఐ కోర్టు ఈనెల 21 వరకు పొడిగించింది.

No comments:

Post a Comment